సువేందు అధికారికి శుభాభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు

  • పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
  • సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
  • కొత్త మంత్రులకు కూడా చంద్రబాబు అభినందనలు
  • ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్ష
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవీ బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి మంత్రి మండలి సభ్యులకు కూడా చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, ఆయన కన్న వికసిత్ భారత్ స్వప్నం స్ఫూర్తిగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో అధికారం చేపట్టిన సువేందు అధికారి ప్రభుత్వం విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు.

ఇవాళ కోల్ కతాలో జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. తాజాగా, సోషల్ మీడియాలోనూ బెంగాల్ నూతన సీఎంకు శుభాభినందనలు తెలిపారు. 

Suvendu Adhikari
Chandrababu Naidu
West Bengal Chief Minister
Andhra Pradesh CM
Narendra Modi
Vikshit Bharat
Bengal Politics
Oath Ceremony
Kolkata

More Telugu News